Amaravati Fire Accidents Case Updates: అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాయపూడి కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైపులకు నిప్పు పెట్టడానికి కారణాలపై అతడ్ని ప్రశ్నిస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద పైపులు దగ్ధమైన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.