ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయనే వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. అమరావతిలో నిర్మాణ పనులను 2028 ఆగస్ట్ నాటికి పూర్తి చేసి.. ప్రదాని మోదీని మరోసారి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామన్నారు. ఈ క్రమంలోనే అమరావతి ఐకానిక్ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే దానిని తేదీలతో సహా వెల్లడించారు.