అమరావతి పర్యటనకు వెళ్లిన వైసీపీ నేతలపై దాడి చేయడాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. చంద్రబాబు గూండాల రాజ్యం నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న దారుణాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ఉండేందుకు వెళ్తున్న వైసీపీ నేతలపై దాడి చేయడం దుర్మార్గమని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అరాచకాలు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయని.. రేపు రెట్టింపు స్పందన ఉంటుందనే సంగతి మర్చిపోవద్దంటూ వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు.