మల్కాజిగిరి కార్పొరేషన్ అధికారులు నగరవాసులకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి భవన నిర్మాణ వ్యర్థాలను ఇష్టం వచ్చినట్లు రోడ్లపై పోస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. రూల్స్ను అతిక్రమించిన వారికి రూ.1 లక్ష ఫైన్తోపాటు.. వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిర్మాణ వ్యర్థాలను ప్రాసెసింగ్ ప్లాంట్లకు మాత్రమే తరలించాలని స్పష్టం చేశారు.