మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండలో ఆదివారం అమావాస్య (ఏప్రిల్ 27) సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావాసులు శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు చీమల దండులా బారులు తీరడంతో, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నియంత్రించారు.