ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువకుడు నిజాముద్దీన్(29) అక్కడ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. కాలిఫోర్నియాలో రూమ్మేట్తో ఏసీ విషయంలో గొడవ జరిగింది. చివరకు అది కాస్త కత్తితో దాడికి దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. నిజాముద్దీన్ని లొంగిపోమని హెచ్చరించారు. అతడు వారి మాట వినకపోవడంతో కాల్పులు జరిపారు. రెండు వారాల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..