అమెరికా వీసా రాలేదనే మనస్తాపం.. హైదరాబాద్‌లో డాక్టర్ ఆత్మహత్య..

3 months ago 8
అమెరికా వీసా రాలేదనే మనస్తాపంతో ఓ డాక్టర్ ఆత్యహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన రోహిణి రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువులు, ప్రాక్టీసు కోసం అమెరికా వెళ్లాలని భావించారు. ఇందులో భాగంగా అమెరికా జే1 వీసా కోసం ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నారు. అయితే వీసా రాకపోవటంతో మనస్తాపంతో ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article