అమ్మ ఒడి పథకంపై కీలక అప్‌డేట్.. పేరు మార్చేసిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ

2 years ago 48
ఏపీ ప్రభుత్వం విద్యాశాఖలో అమల్లో ఉన్న ఐదు పథకాల పేర్లను మార్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మ ఒడిని తల్లికి వందనంగా మార్చారు. అలాగే జగనన్న విద్యాకానుక, జగనన్న గోరు ముద్ద, నాడు నేడు, స్వేచ్ఛ, జగనన్న ఆణిముత్యాలు పథకాల పేర్లను ఏపీ ప్రభుత్వం మార్చింది. వీటికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మన బడి-మన భవిష్యత్, బాలికా రక్ష, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చింది.
Read Entire Article