విశాఖపట్నంలో ఓ అటెండర్ ఇంట్లో లభించిన ఆస్తి పత్రాల విలువ చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. విశాఖపట్నంలో మంగళవారం రోజున ఏసీబీ అధికారులు పలువురు ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. సూపర్బజార్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే కొంతమంది ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా.. ఆనంద్ కుమార్ అనే అటెండర్ ఇంట్లో కోటి రూపాయలు విలువైన స్థిర, చరాస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. జూనియర్ అసిస్టెంట్ ఇంట్లోనూ కోటి రూపాయల ఆస్తులను గుర్తించారు.