సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ యాడ్ను నమ్మి మోసపోవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో రాత్రి పూట అందమైన అమ్మాయిలు, ఆంటీలతో మాట్లాడండి అంటూ వస్తున్న ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పేర్కొన్నారు. అలా మాట్లాడేవారు నిజమైన మహిళలు కాదని సజ్జనార్ వెల్లడించారు.