టీజీఎస్ఆర్టీసీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యాత్రాదానం ప్రాధాన్యతను వివరించాలని ఎండీ సజ్జనార్ విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్లకు పిలుపునిచ్చారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సుల బుకింగ్లను ప్రోత్సహించాలని, టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఉద్యోగుల నిబద్ధత వల్లే సంస్థకు ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు.