అరకు వెళ్లే పర్యాటకులకు రైల్వే అధికారులు తీపికబురు వినిపించారు. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే సందర్శకులు రైళ్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటారు. అయితే పర్యాటకుల రద్దీతో రైలు కిటికిటలాడుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ- కిరండూల్ రైలుకు అదనపు బోగీని ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 21వ తేదీ వరకూ అదనపు బోగీ ఏర్పాటు చేశారు. అలాగే అవసరమైతే ప్రత్యేక రైలు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని వాల్తేరు డీఆర్ఎం అధికారులను ఆదేశించారు.