అరకు వెళ్లే వారికి అదిరిపోయే వార్త.. రైల్వే కీలక నిర్ణయం..

5 months ago 18
అరకు వెళ్లే పర్యాటకులకు రైల్వే అధికారులు తీపికబురు వినిపించారు. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే సందర్శకులు రైళ్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటారు. అయితే పర్యాటకుల రద్దీతో రైలు కిటికిటలాడుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ- కిరండూల్ రైలుకు అదనపు బోగీని ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 21వ తేదీ వరకూ అదనపు బోగీ ఏర్పాటు చేశారు. అలాగే అవసరమైతే ప్రత్యేక రైలు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని వాల్తేరు డీఆర్ఎం అధికారులను ఆదేశించారు.
Read Entire Article