అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరం నుంచి అరుణాచలం యాత్ర పేరుతో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ యాత్రలో కాణిపాకం, తిరుపతి, అరుణాచలం ఆలయాలను సందర్శించవచ్చు. టికెట్ ధరను రూ.3500గా అధికారులు నిర్ణయించారు. జూన్ 22న బస్సు రాజమండ్రి నుంచి బయల్దేరనున్నట్లు అధికారులు తెలిపారు.