Special Bus Godavarikhani to Arunachalam: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల రద్దీ పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ ఆర్టీసీ అధికారులు గోదావరిఖని నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించారు. జూన్ 9న ప్రారంభమైన ఈ బస్సు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటుంది. జూన్ 11న జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణకు ఈ సర్వీసు ఎంతగానో ఉపయోగపడుతుంది.