నగరంలో రాత్రిపూట ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా అర్థరాత్రి వేళల్లో రోడ్లపై పుట్టినరోజు వేడుకలు చేస్తూ, మహిళలను వేధిస్తూ, దొంగతనాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇకపై రాత్రి 12 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగితే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై నిఘా పెట్టామని, పాత నేరస్తుల కదలికలను కూడా గమనిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..