గాజువాక వాంబే కాలనీలో జరిగిన ఒక ఘటన కలకలం రేపింది. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి పొరపాటున దువ్వాడలో దిగి, గాజువాక చేరుకున్నాడు. అక్కడ దాహం వేసి పొరబాటున పశువుల పాకలోకి వెళ్లాడు. అయితే అతన్ని చూసి ఆవులు అరుస్తుండటంతో దొంగగా భావించి స్థానికులు అతనిపై దాడి చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.