రూ.2 లక్షల రుణమాఫీపై విపక్షాలు వక్రభాష్యం చెప్పాయని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అర్హులైన రుణమాఫీ కానివారికి తీపి కబురు చెప్పారు. అలాంటి వారిని గుర్తించి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.