డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి అమాయకపు ప్రజల నుంచి రూ.150 కోట్లు వసూలు చేసిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ మోసం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ, తండ్లే చౌదరి స్వాతి ఈ మోసానికి పాల్పడినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. 16 నెలల్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు ఇస్తామని ప్రచారం చేసి.. అనేక మందిని మోసం చేశారు. కార్యాలయం మూసివేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.