బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఇది వరకే పిటిషనర్ల తరపు వాదనలు ముగియగా.. నేడు స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పీకర్కు ఉన్న ప్రత్యేక అధికారాలను కోర్టులు తీసుకోలేవని అన్నారు. జోక్యం చేసుకున్న సుప్రీం ధర్మాసనం స్పీకర్ నాలుగేళ్లపాటు చర్యలు తీసుకోకపోయినా తాము చూస్తూ ఉరుకోవాలా..? అని కీలక కామెంట్స్ చేసింది.