వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా తీరం దాటి అక్కడే స్థిరంగా ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. రాగల నాలుగు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.