బండి భగీరథ్ కేసుపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్నే వదల్లేదు.. బండి భగీరథ్ను ఎందుకు వదిలేస్తుంది అని ప్రశ్నించారు. ఈ కేసులో బండి సంజయ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవకాశం వచ్చిందని తెలిపారు. వెంటనే బండి సంజయ్ రాజీనామా చేసి.. విచారణకు సహకరించాలని సామ తేల్చి చెప్పారు.