అల్లూరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. డుంబ్రిగూడ మండలం గుంటసీమలో ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులోకి ఈతకు దిగి వీరు మృతి చెందారు. మృతుల్లో ఒక బాలుడిది అదే ఊరు కాగా.. మరో ఇద్దరు మేనమామ ఇంట్లో శుభకార్యం కోసం వచ్చినట్లు తెలిసింది. ముగ్గురు బాలురు ఇలా విగతజీవులుగా మారటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.