హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి ఆన్లైన్లో అవకాడో పండ్లను కొనబోయి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. బాలాజీ ట్రేడర్స్ పేరుతో విజయవాడ నుంచి డెలివరీ చేస్తామని నమ్మించి విడతల వారీగా రూ.2.60 లక్షలు కాజేశారు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.