అవనిగడ్డ: పండగ పూట ఘోర విషాదం.. కృష్ణమ్మా ఎంత పని చేశావమ్మా?

11 months ago 21
శ్రీరామనవమి పర్వదినం రోజున కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీరామనవమి పండుగ వేళ కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడిలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ముగ్గురు బాలురు గల్లంతవ్వగా.. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Entire Article