శ్రీరామనవమి పర్వదినం రోజున కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీరామనవమి పండుగ వేళ కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడిలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ముగ్గురు బాలురు గల్లంతవ్వగా.. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.