కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, మంత్రి ఈశ్వర ఖండ్రే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పత్రాలు అందజేశారు. మిగిలిన రెండు ఏనుగులను సైతం కర్ణాటక సర్కారు త్వరలో ఏపీ ప్రభుత్వానికి అందజేయనుంది. అడవి ఏనుగులను నియంత్రించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఈ ఏనుగులను ఉపయోగిస్తారు. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండే గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా నిరోధించడానికి వీటిని వినియోగిస్తారు.