మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో నేడు ఆయన సభకు హాజరయ్యారు. చివరి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజున సభకు హాజరైన కేసీఆర్.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రెండోసారి హాజరయ్యారు. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.