Ka Paul Reaction On Ahmedabad Flight Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఉగ్రవాదుల దాడి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 242 మంది ప్రయాణికులు మరణించడం బాధాకరమని, దీనిపై వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి సహా 242 మంది మరణించారు.