తెలంగాణ ఓటర్ల జాబితా నుండి 30 వేల పేర్లను తొలగించినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. డబుల్ ఓట్లు కలిగి ఉన్నవారి వివరాలు సేకరించి, వారి సూచనల మేరకు తొలగింపులు జరిగాయన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సంఖ్యను 1500 నుండి 1200కు తగ్గించామని, మొబైల్ ఫోన్ల డిపాజిట్కు ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉందని, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.