నాగర్కర్నూల్ రవాణా శాఖ కార్యాలయం అడ్డగోలు అవినీతికి అడ్డగా మారింది. ఓ ఉన్నతాధికారి ఏజెంట్ల ద్వారా ప్రతి పనికి ధర నిర్ణయించి వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. టీఆర్ రెన్యూవల్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి వాటికి లంచం తప్పనిసరి చేశారు. సదరు అధికారి రోజుకు లక్ష వరకు అక్రమంగా సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులిస్తేనే పనులు జరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.