కరీంనగర్ జిల్లా గంగాధరలో ఓ ఇన్సూరెన్స్ సంస్థ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆ సంస్థ నిర్వాహకుడు.. ఐదు వేలు కడితే కోటి రూపాయల వరకు లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించి మోసం చేశాడు. ఇలా అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి.. నకిలీ పత్రాలతో ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.