హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్, సొంతింటి కల సాకారంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని అన్నారు. రుణాలిచ్చే ముందు క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని ఆయన సూచించారు. హైడ్రా కేవలం కూల్చివేతలకే కాదు, పర్యావరణ హితమైన నగర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అక్రమ కట్టడాలను తొలగిస్తామని, సుస్థిర వ్యాపారానికి హైడ్రా దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. చెరువులను పునరుద్ధరించి, వరద ముప్పు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనేది హైడ్రా లక్ష్యమన్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.