Janasena Party Appoints Observers For 25 Parliaments: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమించారు. తాజాగా ప్రతి పార్లమెంట్కు ఒక పరిశీలకుడిని నియమించారు. ఈ నెల 29 నుంచి ఈ పరిశీలకులు, మరో 27 మంది సభ్యులు మొత్తం 28 మంది సభ్యుల కమిటీ ప్రతీ పార్లమెంట్లో పార్టీకి సంబంధించిన పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు.. వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న జనసేన పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమాచారాన్ని సేకరిస్తారు.