ఎట్టకేలకు నైరుతి రుతుపవనాల్లో కదలిక.. తెలంగాణలో ఇక వానలే వానలు, 3 రోజుల పాటు భారీ వర్షాలు

1 hour ago 1
తెలంగాణలో మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి. రానున్న 24 గంటల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయి. తెలంగాణ నుంచి మన్నార్ వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమవగా.. రాగల మూడు రోజులు జగిత్యాల, మెదక్, ఆదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article