AP PHC Doctors Association Strike: ఏపీలో నేటి నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తామంటున్నారు డాక్టర్లు. రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో... అక్టోబరు 3 నుంచి విజయవాడలో నిరసన తెలియజేస్తామని ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం తెలిపింది. వైద్యుల సమ్మె చట్టవిరుద్ధమని.. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని.. కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు వైద్యారోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ ఆదేశించారు. అసలే వర్షాలు పడుతుండటంతో సీజనల్ వ్యాధులతో పీహెచ్సీలకు రోగుల వస్తున్నారు.. ఇలాంటి సమయంలో డాక్టర్లు సమ్మె అనడం ఇబ్బందిగా మారింది.