ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి అందించనుంది. అలాగే, ఫైబర్నెట్ టెక్నికల్ కమిటీని పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి, వృద్ధి రేటును పెంచేందుకు సూచనలు చేశారు.