కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీ ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోయాయి. పెన్షనర్లు కూడా పెన్షన్లు పొందలేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, సంస్థ పాలకవర్గం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అకడమిక్ అసోసియేషన్ నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం వారు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ పరిణామాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ సంస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.