నిర్మల్ జిల్లాలోని న్యూ కంజర గ్రామంలో ధరణి పోర్టల్ కారణంగా సుమారు 1000 ఎకరాల భూమి అసైన్డ్ జాబితాలో చేరింది. దీంతో 312 రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో కొనుగోళ్లు, అమ్మకాలు జరగడం లేదు. సమస్య పరిష్కారం కోసం రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు, కానీ ఫలితం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి పోర్టల్ కూడా అసైన్డ్ మాడ్యూల్ లేకపోవడంతో పరిష్కారం చూపలేకపోతుంది. పూర్తి వివరాలు మీకోసం..