ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ఊరిని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. పరిశ్రమల కాలుష్యం గురించి చర్చించారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధితోపాటు కాలుష్యమూ పెరిగిపోయిందన్న పవన్ కళ్యాణ్.. పరవాడ మండలం తాడి గ్రామాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. కాలుష్యాన్ని నివారించడం వీలు కాని పరిస్థితి అని అభిప్రాయపడిన పవన్ కళ్యాణ్.. నియంత్రించే ప్రయత్నం చేద్దామని సూచించారు.