Rajam 700 Grams Per 1 Kg Cheating: విజయనగరం జిల్లా రాజాంలో పండ్ల వ్యాపారులు కేజీకి 700 గ్రాముల చొప్పున తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని తూనికలు కొలతల శాఖ అధికారులు గుర్తించారు. ఫిర్యాదులు రావడంతో షాపులపై దాడులు చేసి, 16 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. తూకాల్లో మోసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మోసాలు జరిగినట్లు గుర్తిస్తే టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.