కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై మూడు నెలల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో స్పీకర్ కార్యాలయం వీరికి నోటీసులు పంపి.. వివరణ కోరింది. అయితే, తామంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని చాలా మంది రిప్లయ్ ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. కవిత ఎపిసోడ్పై కూడా స్పందించారు.