Gutha Amith Reddy: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా నిర్దేశించుకున్న హస్తం పార్టీ.. తాజాగా కీలక నియామకాలు చేసింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి టీపీసీసీ వార్రూమ్ చైర్మన్గా, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు ఓబీసీ విభాగం చైర్మన్గా పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకాలతో ఎన్నికల వ్యూహాలకు కొత్త ఊపు రానుంది.