తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అయితే ఈ వరదల్లో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ కుటుంబంలో అయిన పశువులు మరణించినా తగిన పరిహారం ఇస్తామన్నారు. ఇక తెలంగాణలో రానున్న రోజుల్లో కూడా భారీ వర్షం నమోదు కానున్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.