ఆ ఘటనలో పూర్తి బాధ్యత హైడ్రాదే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: కమిషనర్ రంగనాథన్

11 months ago 22
పాతబస్తీలోని యాకుత్‌పురాలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంచార్జి నిర్లక్ష్యం వల్ల ఓ ఐదేళ్ల బాలిక ప్రమాదానికి గురైంది. నడుచుకుంటూ వెళ్తున్న బాలిక మూసివేయని మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. తల్లి వెంట ఉండటంతో ఆమె వెంటనే కేకలు వేయగా.. స్థానికులు స్పందించి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. బుధవారం క్లీనింగ్ కోసం మ్యాన్‌హోల్‌ను తెరిచారు. అయితే దానిని మూయకుండా వెళ్లిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Read Entire Article