తెలంగాణలో త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని.. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే స్పందించారు. ఉపఎన్నికలొస్తే తాను కచ్చితంగా బరిలో ఉంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అయితే.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదేనని చెప్పుకొచ్చారు.