Andhra Pradesh Ants Food: ఆంధ్రప్రదేశ్లోని గిరిజనులు పుల్లేరు చీమలతో విభిన్న వంటకాలు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రాంతాల్లో లభించే ఈ చీమలతో వీరు సూప్, కూర, పచ్చడి వంటి ఆరు రకాల వంటలు చేస్తారు. వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని వారు నమ్ముతారు. ఒడిశాలోని మయూర్భంజ్లో ఎర్ర చీమలతో చేసే 'కై చట్నీ'కి జీఐ ట్యాగ్ కూడా లభించిన సంగతి తెలిసిందే. ఈ చట్నీ దగ్గు, జలుబు వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందట.