Sri Gandham Trees Theft: ఏలూరు జిల్లాలో శ్రీగంధం చెట్లు నరికి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన నలుగురు ఆదివాసీలు కామవరపుకోట, టి.నరసాపురం ప్రాంతాల్లో చెట్లు నరికి చోరీలకు పాల్పడుతున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెట్టి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.5,50,000 విలువైన శ్రీగంధం దుంగలు, బైక్లు, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 12 కేసులు నమోదయ్యాయి.