సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న చెరువులను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ.2500 కోట్లు నిధులు మంజూరు కానున్నాయి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు 15 చెరువులను పరిశీలించి, సుందరీకరణకు తగు సూచనలు ఇచ్చారు. ప్రతి చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, నెక్లెస్ రోడ్డు, బోటింగ్, పార్కులతో పాటు బతుకమ్మ, వినాయక నిమజ్జనం ఘాట్లను నిర్మించాలని ఆయన సూచించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు.