Jeelugumilli Naval Armament Depot: ఏలూరు జిల్లాలో రూ.2,500 కోట్లతో నౌకాదళ ఆయుధాగారం ఏర్పాటు కానుంది. పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి ప్రాంతంలో దీనిని నిర్మించనున్నారు. ఎంపీ పుట్టా మహేశ్కుమార్ ఆధ్వర్యంలో నేవీ అధికారులతో సమావేశం జరిగింది. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఏలూరు ఎంపీ తెలిపారు. జీలుగుమిల్లిలో 1,166 ఎకరాల భూమిని సేకరించనున్నారు. పదేళ్లలో ఆయుధ నిల్వ కేంద్రం, ఉద్యోగుల క్వార్టర్లు నిర్మిస్తామని నేవీ అధికారులు వెల్లడించారు.