ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు భారీ ప్రోత్సాహం అందిస్తోంది. దీనిలో భాగంగా నెల్లూరు, విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో పలు కంపెనీలకు భూములు కేటాయించింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇఫ్కో కిసాన్ సెజ్కు 2776 ఎకరాలు కేటాయిసస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా 70 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు రానున్నాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయంటున్నారు.