Kurnool Another Industry Worth Of Rs 6000 Crore: ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వరద కొనసాగుతోంది! కర్నూలు జిల్లాలో రూ.6 వేల కోట్లతో భారీ పరిశ్రమ రానుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. సింగిల్ విండో విధానంతో అనుమతులు సులభతరం చేశామన్నారు. రిలయన్స్ కూడా రూ.1,600 కోట్లతో పరిశ్రమను ప్రారంభిస్తోంది. చంద్రబాబు నాయుడు హయాంలో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఎన్ఆర్ఐలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.